Monday, July 29, 2013

The List of Hindu Temples converted to mosque in AP


A Preliminary Survey of some of the Hindu temples that were converted to mosques and muslim monuments in Andhra Pradesh is given here. Many such muslim construction have used the materials of the Hindu temple after it was destroyed by the muslims. This shows the true nature of the eligion Islam. Some of the districts have been renamed or newly created. Some places which was under one district is now in another district. Those who read this can point out errors if any. I. Adilabad District. Mahur, Masjid in the Fort on the hill. Temple site. II. Anantpur District. 1. Gooty, Gateway to the Hill Fort. Temple materials used. 2. Kadiri, Jmi’ Masjid. Temple site. 3. Konakondla, Masjid in the bazar. Temple materials used. 4. Penukonda (i) Fort. Temple materials used. (ii) Masjid in the Fort. Converted Temple. (iii) Sher Khn’s Masjid (1546).38 Converted Temple. (iv) Dargh of Babayya. Converted ÃŽvara Temple. (v) Jmi’ Masjid (1664-65). Temple site. (xi) Dargh of Shh Fakbru’d-Dn (1293-94). Temple site. 5. Tadpatri (i) Jmi’ Masjid (1695-96). Temple site. (ii) Idgh completed in 1725-26. Temple site. 6. Thummala, Masjid (1674-75). Temple site. III. Cuddapah District 1. Cuddapah (i) Bhp Shib-k-Masjid (1692). Temple site. (ii) Idgh (1717-18). Temple site. (iii) Bahdur Khn-k-Masjid (1722-23). Temple site. (iv) Dargh of Shh Amnu’d-Dn Ges Darz (1736-37). Temple site. 2. Duvvuru, Masjid. Temple site. 3. Gandikot, Jmi’ Masjid (1690-91). Temple site. 4. Gangapuru, Masjid. Temple site. 5. Gundlakunta, Dastgr Dargh. Temple site. 6. Gurrumkonda, Fort and several other Muslim buildings. Temple materials used. 7. Jammalmaduguu, Jmi’ Masjid (1794-95). Temple site. 8. Jangalapalle, Dargh of Dastgr Swm. Converted Jangam temple. 9. Siddhavatam (i) Qutb Shh Masjid (restored in 1808). Temple materials use. (ii) Jmi’ Masjid (1701). Temple materials used. (iii) Dargh of Bismillh Khn Qdir. Temple materials used. (iv) Fort and Gateways. Temple materials used. (v) Chowk-k-Masjid. Temple site. 10. Vutukuru (i) Masjid at Naligoto. Temple site. (ii) Masjid at Puttumiyyapeta. Temple site. IV. East Godavari District. Bikkavolu, Masjid. Temple materials used. V. Guntur District. 1. Nizampatnam, Dargh of Shh Haidr (1609). Temple site 2. Vinukonda, Jmi’ Masjid (1640-41). Temple site. VI. Hyderabad District. 1. Chikalgoda, Masjid (1610). Temple site. 2. Dargah, Dargh of Shh Wal (1601-02). Temple site. 3. Golconda (i) Jmi’ Masjid on Bl Hissr. Temple site. (ii) Trmat Masjid. Temple site. 4. Hyderabad (i) Dargh of Shh Ms Qdir. Temple site. (ii) Masjid on the Pirulkonda Hill (1690). Temple site. (iii) Tol Masjid (1671). Temple materials used. (iv) Dargh of Min Mishk (d. 1680). Temple site. (v) Dargh of Mu’min Chup in Aliybd (1322-23). Temple site. (vi) Hj Kaml-k-Masjid (1657). Temple site. (vii) Begum Masjid (1593). Temple site. (viii) Dargh of Islm Khn Naqshband. Temple site. (ix) Dargh of Shh D’d (1369-70). Temple site. (x) Jmi’ Masjid (1597). Temple site. 4. Maisaram, Masjid built by Aurangzeb from materials of 200 temples demolished after the fall of Golconda. 5. Secunderabad, Qadam RasUl. Temple site. 6. Sheikhpet (i) Shaikh-k-Masjid (1633-34). Temple site. (ii) SariwAl Masjid (1678-79). Temple tite. VII. Karimnagar District. 1. Dharampuri, Masjid (1693). TrikTa Temple site. 2. Elangdal (i) Mansr Khn-k-Masjid (1525). Temple site. (ii) Alamgr Masjid (1696). Temple site. 3. Kalesyaram, lamgr Masjid. Temple site. 4. Sonipet, lamgr Masjid. Temple site. 5. Vemalvada, Mazr of a Muslim saint. Temple site. VIII. Krishna District. 1. Gudimetta, Masjid in the Fort, Temple materials used. 2. Guduru, Jmi’ Masjid (1497). Temple materials used. 3. Gundur, Jmi’ Masjid. Converted temple. 4. Kondapalli (i) Masjid built in 1482 on the site of a temple after Muhammad Shh BahmanI had slaughtered the Brahmin priests on the advice of Mahmd Gawn, the great Bahman Prime Minister, who exhorted the sultan to become a Ghz by means of this pious performance. (ii) Mazr of Shh Abdul Razzq. Temple site. 5. Kondavidu (i) Masjid (1337). Temple materials used. (ii) Dargh of Barandaula. Temple materials used. (iii) Qadam Sharf of dam. Converted temple. 6. Machhlipatnam (i) Jmi’ Masjid. Temple site. (ii) Idgh. Temple site. 7. Nandigram, Jmi’ Masjid. Temple site. 8. Pedana, Iama’il-k-Masjid. Temple site. 9. Rajkonda, Masjid (1484). Temple site. 10. Tengda, Masjid. Temple site. 11. Turkpalem, Dargh of Ghlib Shahd. Temple site. 12. Vadpaili, Masjid near NarsiMhaswmn Temple. Temple materials used. 13. Vijaywada, Jmi’ Masjid. Temple site. IX. Kurnool District. 1. Adoni (i) Jmi’ Masjid (1668-69). Materials of several temples used. (ii) Masjid on the Hill. Temple materials used. (iii) Fort (1676-77). Temple materials used. 2. Cumbum (i) Jmi’ Masjid (1649). Temple site. (ii) Gachinl Masjid (1729-30). Temple site. 3. Havli, Jmi’ Masjid. Temple materials used. 4. Karimuddula, Dargh. Akkadevi Temple materials used. 5. Kottakot, Jmi’ Masjid (1501). Temple site. 6. Kurnool (i) Pr Shib-k-Gumbad (1637-38). Temple site. (ii) Jmi’ Masjid (1667). Temple site. (iii) Ll Masjid (1738-39). Temple site. 7. Pasupala, Kaln Masjid. Temple site. 8. Sanjanmala, Masjid. Temple sites. 9. Siddheswaram, Ashurkhna. Temple materials used. 10. Yadavalli, Mazr and Masjid. Temple sites. 11. Zuhrapur, Dargh of Qdir Shh Bukhr. Temple site. X. Mahbubnagar District. 1. Alampur, Qal-k-Masjid. Temple materials used. 2. Jatprole, Dargh of Sayyid Shh Darwish. Temple materials used. 3. Kodangal (i) Dargh of Hazrat Nizmu’d-DIn. Temple site. (ii) Jmi’ Masjid. Temple site. 4. Kundurg, Jmi’ Masjid (1470-71). Temple site. 5. Pargi, Jmi’ Masjid (1460). Temple site. 6. Somasila, Dargh of Kamlu’d-Dn Baba (1642-43) Temple site. XI. Medak District. 1. Andol, Old Masjid. Temple site. 2. Komatur, Old Masjid. Temple site. 3. Medak (i) Masjid near Mubrak Mahal (1641). Vishnu Temple site. (ii) Fort, Temple materials used. 4. Palat, Masjid. Temple site. 5. Patancheru (i) Jmi’ Masjid. Temple materials used. (ii) Dargh of Shykh Ibrhm known as Makhdmji (1583). Temple site. (iii) Ashrufkhna. Temple site. (iv) Fort (1698). Temple materials used. XII. Nalgonda District. 1. Devarkonda (i) Qutb Shh Masjid. Temple materials used. (ii) Dargh of Sharfu’d-Din (1579). Temple site. (iii) Dargh of Qdir Shh Wal (1591). Temple site. 2. Ghazinagar, Masjid (1576-77). Temple site. 3. Nalgonda (i) Garh Masjid. Temple site. (ii) Dargh of Shh Latf. Temple site. (iii) Qutb Shh Masjid (Renovated in 1897). Temple site. 4. Pangal, lamgr Masjid. Temple site. XIII. Nellore District. 1. Kandukuru, Four Masjids. Temple sites. 2. Nellore, Dargh named Dargmitt. Akkaslvara Temple materials used. 3. Podile, Dargh. Temple site. 4. Udayagiri (i) Jmi’ Masjid (1642-43). Temple materials used. (ii) Chhot Masjid (1650-51). Temple materials used. (iii) Fort. Temple materials used. XIV. Nizambad District. 1. Balkonda (i) Patthar-k-Masjid. Temple site. (ii) Idgh. Temple site. 2. Bodhan (i) Deval Masjid. Converted Jain temple. (ii) Patthar-k-Masjid. Temple site. (iii) lamgr Masjid (1654-55). Temple site. 3. Dudki, Ashrufkhna. Temple materials used. 4. Fathullapur, Mu’askar Masjid (1605-06). Temple site. XV. Osmanabad District. Ausa, Jmi’ Masjid (1680-81). Temple site. XVI. Rangareddy District. Maheshwar, Masjid (1687). Madanna Pandit’s Temple site. XVII. Srikakulam District 1. Icchapuram, Several Masjids. Temple sites. 2. Kalingapatnam, DargAh of Sayyid Muhammad Madn Awliy (1619-20). Temple materials used. 3. Srikakulam (i) Jmi’ Masjid (1641- 42). Temple site. (ii) Dargh of Bande Shh Wal (1641- 42). Temple site. (iii) Atharwl Masjid (1671-72). Temple site. (iv) Dargh of Burhnu’d-Dn Awliy. Temple site. XVIII. Vishakhapatnam District. 1. Jayanagaram, Dargh. Temple site. 2. Vishakhapatnam, Dargh of Shh Madn. Temple site. XIX. Warangal District. Zafargarh, Jmi’ Masjid. Temple site. XX. West Godavari District. 1. Eluru (i) Fort. Temple materials used. (ii) Sawi Masjid. Converted temple. (iii) Qzi’s House. Somevara Temple materials used. 2. Nidavolu, Masjid. Mahdeva Temple materials used. 3. Rajamundri, Jmi’ Masjid (1324). Converted VeNugoplaswmin Temple. http://hindutemples-whthappendtothem.blogspot.in/2007/03/list-of-hindu-temples-converted-to.html

Thursday, July 25, 2013

Prosecute beggars, says NGO (The Hindu . Dt :Sunday, May 02, 2010)


Act provides for arrest of anyone begging without warrant .
HYDERABAD: Although two months have passed after AP Prevention of Begging Rules, 2010 was enacted into law, little has been done to enforce it at the ground level. Despite the rules mandating enforcement authorities to arrest beggars no arrests were made across the State, Abhipraay, an NGO fighting against beggary said here on Saturday. The Rules were passed by the State's Social Welfare Department on March 31 to implement the AP Prevention of Begging Act, 1977. “The rules came after 33 years after a lot of struggle. We were forced to go to the Court, file a write petition and wait for a long time before the rules were framed,” said Bhaskar Poluri, an advocate who works with Abhipray. “If they had implemented the Act in 1977, we would have abolished beggary by today. We want the government to the Act as per rules without any delay.” The Act authorises any police officer above the rank of a Sub-Inspector or a revenue officer above the rank of a Tahsildar or District Probation Officer to arrest without a warrant any person begging in a public place. After medical check-up by a doctor not below the rank of an assistant civil surgeon who determines age, sex and physical and mental fitness of a beggar, he/she has to be produced before the Court that enquires into the respective case. “If the beggar is found guilty of the offence under the Act and is physically capable of doing manual labour, the court would order his detention in a workhouse for a specified period not exceeding three years,” said Suresh Pandit, co-ordinator. The government, either by itself or assisted by NGOs, has to provide elementary education and vocational training towards rehabilitating them. http://www.hindu.com/2010/05/02/stories/2010050260100200.htm

Tuesday, July 23, 2013

లోకమాన్య బాల గంగాధర్ తిలక్ జయంతి - 23 జూలై ( 1856 - 1920 )


స్వరాజ్యం నా జన్మహక్కు - తిలక్ జాతీయ హిందూవాదం - తిలక్ కు వేదమే! స్వరాజ్యం నా జన్మ హక్కు - దాన్ని సాధించి తీరుతాను అని శపధం పూని ఆ లక్ష్యాన్ని సాధించుకునే దిశలో ముందుకు సాగిన మహనీయుల్లో, బాల గంగాధర్ తిలక్ ని ప్రప్రధమంగా స్మరించి తీరాలి. ఈయన లోకమాన్య తిలక్ గా కూడ ప్రసిద్ధిచెందారు. భారతీయ జాతీయవాది, సామాజికవాది, స్వాతంత్ర్య సమరయోధులు అయిన తిలక్ భారత స్వాతంత్ర్యోద్యమంలో ప్రజాదరణ పొందిన మొట్టమొదటి అధినేతల్లో ఒకరు అని చెప్పాలి. అందుకే ఆయణ్ణి ఆ రోజుల్లో భారతదేశపు ఆందోళన స్థితిని ప్రకటించిన వర్గానికి పితామహుడని, సంపూర్ణస్వరాజ్యోద్యామనికి ప్రప్రధమ నాయకుడనీ చెప్పితీరాలి. అంతే కాకుండా హిందూ జాతీయవాదానికి కూడ విత్తనాల్ని నాటిన అధినేత అనే చెప్పాలి. తిలక్ భారతదేశచరిత్రావగాహన లో నిష్ణాతుడు, సంస్కౄతపండితుడు, గణిత, ఖగోళశాస్త్రాల్లోను, హిందూత్వంలోను, ఘటికుడు. ఆధునిక భారతీయ విద్యావిధానానికి ఆద్యుడు మహారాష్ట్రలోని రత్నగిరి దగ్గరగానున్న 'చిఖలీ గ్రామంలో 1856, జూలై, 23 న మధ్యతరగతి 'చిత్పవణ్ కుటుంబంలో జన్మించారు. బాల్యం నుంచి తిలక్ ది వేదాంతధోరణే. భారతదేశంలో, ఆధునికభావాలతో కాలేజీ విద్యను అభ్యసించిన మొదటితరం యువకవర్గపు ప్రతినిధిగా తిలక్ ను భావించాలి. పట్టభద్రచదువు తర్వాత, పూణేలోని ప్రైవేట్ పాఠశాలలోను, తర్వాత ఫెర్గూసన్ కాలేజీలో లెఖ్ఖల మాష్టారు ఉద్యోగం చేయడం, తర్వాత పత్రికా విలేఖరి గా ఉద్యోగం చేశాడు. ఆ రోజుల్లో పాశ్చాత్య విద్యావిధానం భారతీయ సంస్కౄతికి, విద్యార్ధులకు అవమానకరంగాను, అగౌరవంగాను, ఉన్నందున బాహాటంగా నిరసన ప్రకటించిన ధైర్యశాలి. అంతేకాక, భారతీయ యువతకు విద్యలో విలువలను పెంచే ఉద్ద్యేశ్యంతో డక్కన్ విద్యాసంస్థను స్థాపించాడు. సంపూర్ణస్వరాజ్యం కోసం రాజకీయ పోరాటానికి నాంది మరాఠీ భాషలో దినపత్రిక కేసరి (సింహం) స్థాపించడం, స్వల్పకాలంలో బహుళాదరణ చెందడం జరిగింది. వాక్కు స్వాతంత్ర్యం పై గల అణచివేతవిధానంపై నిరసన వ్యక్తం చేయడం, ప్రత్యేకంగా 1905 లో బెంగాలీ విభజనద్వారా తగ్గుతున్న భారతీయతకు, ప్రజకు, సంస్కౄతిపట్ల చూపుతున్న నిర్లక్ష్యవైఖరిపై యుద్ధాన్ని ప్రకటిస్తూ, భారతానికి స్వరాజ్యాన్ని అందించాలని బ్రిటిషుప్రభుత్వాన్ని నిలదీశాడు. హిందూత్వం పై తిలక్ స్వతంత్ర ఆలోచనావిధానాలు భారతీయ జాతీయ కాంగ్రేసు లో తిలక్ 1890 ల్లో చేరినా, ఆధునిక స్వేచ్చావాదవర్గంతో సంపూర్ణ స్వరాజ్య సాధన కోసం జరిపిన ఆలోచనావిధానాలపై అసమ్మతీయతను ప్రకటించాడు. 1891 లో ఆడపిల్లల పెళ్ళివయసుని 10 నుంచి 12 పెంచడంపై, విదేశీవిధానాన్ని అమలుచేయడంపట్ల, కాంగ్రేసు తదితర ఉదారవర్గం సమర్ధించడం, దీనికి భారతీయసంస్కౄతిలో కల్పించుకోవడం, వ్యక్తంచేసిన నిరసనతో, తిలక్ ను ఒక వితండ హిందూవివాదిగా గుర్తించడం జరిగింది. ఏమైనా, 1857 సిపాయిలకలహం తర్వాత, భారతదేశంపట్ల బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన మొదటి విప్లవాత్మక మార్పు అనిమాత్రం చెప్పాలి. హిందూమతసంస్కౄతిలో జోక్యం చేసుకున్నట్లు తిలక్ భావించడం జరిగింది. బొంబే లో ప్లేగు వ్యాధి తెచ్చిన ముప్పు బొంబాయిలో 1897 లో తాండవించిన ప్లేగు వ్యాధి, పూనాకు పాకుతుందని ఆందోళనతో ప్రభుత్వం తీసుకున్న నివారణ ప్రయత్నాలు శౄతిమించడం - వ్యాధి సోకని ప్రాంతాల్లోని కుటుంబాల్ని చెదరకొట్టడం, అనవసరంగా ఆవాసాల్ని మార్చడం, తరలింపుల్లో ప్రజల ఆస్తుల్ని దోచుకోవడం పట్ల పెరిగిన నిర్లిప్తత, పట్టించుకోని ప్రభుత్వ పరిపాలన పై దుమారాన్ని ప్రకటిస్తూ, కేసరి పత్రికలో వివాదాస్పదమైన వ్యాసాల్ని ప్రచురించడం, శత్రువుని సంహరించడంలో భగవద్గీతలోని భావాల్ని ఉదాహరించడం ద్వారా, ఎవరినీ తప్పుపట్టకూడదని చెప్పడం, ఆ మర్నాడు 27 జూన్ న పూనా సహాయక కలెక్టర్, బౄందాన్ని సంహరించడం జరిగింది. ఈ ఘటనకు, తిలక్ ప్రచారం ఉసికొల్పిందన్న నేరానికి, 18 నెల్ల జైలు శిక్షను అనుభవించాడు. విడుదల తర్వాత, జాతీయనాయకుడిగా తిలక్ కు కొత్తగా గుర్తింపు, 'స్వరాజ్యం నా జన్మహక్కు - దాన్ని సాధించి తీరుతానూ అన్న నినాదం ఈ సందర్భంగా అవతరించింది. ఈ నినాదమే, తిలక్ పేరుతోపాటు, అవిభాజ్యంగా వస్తూనేవుంది. గోఖలే తో వాదోపవాదం మరింతగా ఆధునిక భావాలున్న గోపాల కౄష్ణ గోఖలే తో తిలకు కు విబేధాలు రావడం, దీనికి ఆనాటి జాతీయ నాయకులు, బిపిన్ చంద్ర పాల్ (బెంగాల్), లాలా లజపతి రాయ్ (పంజాబ్) ల్ నుంచి సమర్ధన రావడంతో, ఈ త్రివేణీభావకూటమిని, 'లాల్-బాల్-పాళ్ అని పిలిచెడివారు. 1907 సూరత్ కాంగ్రేసు సమావేశం, గరం దళ్ (విప్లవకారులు - త్రివేణీకూటమి), నరం దళ్ (ఆధునికకారులు గా విడిపోవడం జరిగింది. ఈ విభజనకు తిలక్, గోఖలేలు, ఆందోళనతో, జాతీయోద్యమానికి విఘాతమని భావించారు. కాని, ఫిరోజ్ షా మెహతా సన్నిహితుడైన హెచ్.ఎ.వైద్య, ఈ కూటమి కాంగ్రేస్ శరీరంలో ఒక అంగవిహీనమని, దీనికి శస్త్రచికిత్సే శరణ్యమని చెప్పాడు. 1908 ఏప్రిల్ 30 న జరిగిన ముజఫరుపూర్ లో జిల్లాజడ్జిపై బాంబుని యిద్దరు బెంగాలీయువకులు విసరడం, ప్రమాదవశాత్తు, మహిళాప్రయాణికులు మరణించడం, పోలీసుల సోదాలపై కలకత్తాలో వినాశసామగ్రి దొరకడం జరగ్గా, ఈ పూర్తి కధనాన్ని తిలక్ తన కేసరి పత్రికలో సమర్ధించడం, సంపూర్ణ స్వరాజ్యాన్ని కోరడం పై, ప్రభుత్వం తిరిగి తిలక్ ను కష్టడీలోకి తీసుకుంది. అప్పటి యువనాయకుడు మహమ్మదు అలి జిన్నాని ప్రాతినిధ్యం వహించాలని తిలక్ కోరాడు. కాని, బ్రిటిష్ ప్రభుత్వం తిలక్ కు బర్మాలో ఆరేళ్ళు, 1914 వరకు జైల్లో పెట్టింది. జైలునుంచి విడుదల తర్వాత, తిలక్ 1916 లో తిరిగి కాంగ్రేసు లో జాతీయవాదులతో చేరడం, అఖిలభారత హోం రూల్ ఉద్యమంలో 1918 వరకూ అనిబెసెంట్, జిన్నాలకు సహాయం చేశాడు. సర్వ మత, జాతులకి స్వరాజ్యంలో సమభాగస్వామ్యం మరాఠా రాజకీయ సిద్దాంత ప్రచారక ప్రవక్తగా ప్రారంభం కావించిన తిలక్, విభజన తదుపరి బెంగాల్ జాతీయ నాయకుల సాన్నిహిత్యంతో, ప్రముఖ జాతీయనాయకుడిగా ఉన్నత శిఖరాల్ని అధిరోహించాడు. మరాఠా రాజకీయపాలన తరహాలో భారతీయస్వరాజ్యపరిపాలన కొనసాగుతుందా అన్న ప్రశ్నకి, 16-17 శతాబ్దాలకాలం లో నడచినా, తర్వాత మరాఠా తరహా 20 శ. లో సరితూగదని, నిజమైన ఫెడరల్ వ్యవస్థతో సంపూర్ణభారతస్వరాజ్య పరిపాలనలో, అన్ని మతాలకి, వర్గాలకి సమప్రాధాన్యత, భాగస్వామ్యం వహిస్తాయని, ఇటువంటి కూటమే భారతదేశాన్ని స్వరాజ్యంతో పరిరక్షించడం జరుగుతుందని తిలక్ నిస్సందేహంగా వివరించాడు. కర్మయోగసహిత జ్ౙానయోగం పై సమర్ధన ప్రాధమికంగా తిలక్ అద్వైత సిద్దాంతవాది అయినా, కేవలం జ్ౙానమే మానవునికి విముక్తినిస్తుంది అన్న ప్రాచీనాద్వైతవాదాన్ని త్రోసిరాజని, కర్మయోగసిద్దాంతం తో కూడిన జ్ౙానయోగం ఫలితాల్నిస్తుందని, రెండూ ఉభయతారకంగా ఆచరణకు రావాలని వక్కాణించాడు. తిలక్ ప్రతిపాదించిన సాంఘికసంస్కరణల్లో, ముఖ్యంగా - వివాహానికి కనీసవయసు, తాగుడుపై పూర్తి నిషేధంతోపాటు సరుకు దొరకకూడని పరిస్థితిని కల్పించాలన్న పట్టుదల, విద్యావిధానం, భారతీయ రాజకీయ ప్రస్థానం లో సూచించిన మార్పులు చాలా ప్రభావప్రేరణలు కలిగించాయి. హింది జాతీయభాషగా తొలి ప్రతిపాదనలు భారతీయ జాతీయ కాంగ్రేసు లో ప్రధమ నాయకుడిగా, దేవనాగరి లిపిలో వ్రాయబడే హిందీ భాషను ఏకైక జాతీయభాషగా ప్రతిపాదిస్తూ, మొట్టమొదటి నాయకుడు తిలక్ అని చాలామందికి తెలియని విషయం. ఈ వాదననే, తర్వాత మహాత్మాగాంధి సమర్ధించాడు. అయితే, తిలక్ ఆంగ్లభాషను మాత్రం భారతీయుల మేధస్సుల్లోంచి పూర్తిగా చెరపివేయాలన్న ప్రతిపాదనకు మాత్రం ఆచరణకు సాధ్యం కాలేదు. భారతీయపరిపాలన, సాంఘికజీవన విధానాల్లో, సమాచార, భావ ప్రకటన విధానాల్లో, జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో, ఆంగ్లం తిరుగులేని భాషామాధ్యమంగా తనదైన స్థానాన్ని పొందుతూనేవుంది. వసుధైకకుటుంబం భావనకు ఆంగ్లభాషామాధ్యమం అనివార్యం అన్న భావన అనేక దేశాలు ప్రపంచంలో గుర్తించాయి అన్నది నగ్నసత్యం. కాని, హిందీతో సహా భారతీయ భాషల వాడుకవిధానాలు మాత్రం తిలక్ ప్రతిపాదనల తర్వాత ఒక ఊపు, రూపు దిద్దుకున్నాయన్న విషయం కూడ నగ్నసత్యమే. సార్వజనిక, సామూహిక గణపతి పూజలు - తిలక్ భావవాహినీప్రభావమే!!! తొలుత అవిఘ్నమస్తు అని, తొండమునేకదంతమును తోరపుబొజ్జయున్ అని, శుక్లాంబరధం ... ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అంటూ హైందవేతిహాసస్ఫూర్తితో భారతీయులు వారివారి పూజామందిరాల్లో ప్రతినిత్యం సుప్రభాతవేళల్లో జరుపుకునే నిత్య ఆధ్యాత్మిక తొలిప్రార్ధనలకు, ఒక సామూహికమైన, సామాజికమైన, సార్వజనికతను ప్రసాదించిన ప్రప్రధమ ప్రతిభామూర్తి, నిస్సందేహంగా,బాల గంగాధర తిలక్ మహాశయుడే. మూడురోజుల ముచ్చట నుంచి, అయిదురోజులు, గణపతి నవరాత్రులు, మాసాంతంగానూ పూజోత్సవాల్ని సామాజికంగా, సామూహికంగా, భాద్రపద శుక్ల ( గణేశ ) చతుర్దశిగా ప్రారంభించేవి, అనంత చతుర్దశి (ఆగష్టు/సెప్టెంబరు నెలల్లో) ఒక అనివార్య సమావేశాలకి సదవకాశాన్నిచ్చింది. ముఖ్యంగా, నాయకులకు ప్రజలతో సంభాషణలు చేసుకోవడానికి వేదికలుగా మారాయి. శుభప్రారంభంగా, గ్వాలియర్ లో సర్దార్ ఖస్గివాలే ప్రోత్సాహంతో నిర్వహించిన పూజోత్సవాలు, సర్వోపయోగమని గ్రహించి, ఈ నూతనభావాల్ని 26 సెప్టెంబర్ 1893 లో తన కేసరి పత్రికలో సవివరంగా ప్రచురించడం జరిగింది. ఈ ఫక్కీలో, విదేశీ వస్తువుల్ని, సేవల్ని, బహిష్కరించమని చేసిన ప్రకటనలకు, పిలుపులకు, సద్స్ఫూర్తినివ్వడమే కాక, దేశీయత, దేశభక్తి, భారతీయప్రజల్లో నరనరాల్లో దూసుకుపోవడం అనూహ్య పరిణామం, పరిమాణం అని చెప్పాలి. పిదపకాలం లో తిలక్ గాంధీ నిర్వహించిన అహింస, పౌరసహాయనిరాకరణ విధానాలపై, తిలక్ నుంచి విమర్శలు వచ్చేవి. ఒకానొక కాలంలో, తిలక్ ను అతివాదకునిగా భావించబడినా, తిలక్ చర్యల్లో కొంత మెరుగుతనం కనిపించేవి. ఉభయవర్గాల మధ్య సహౄద్భావ వాతావరణంలో సంభాషణలు భారతస్వరాజ్యానికి మరింత ప్రభావితమాధ్యమాలవుతాయని తిలక్ భావించాడు. అంతేకాక, భారతీయ చరిత్ర, సంస్కౄతి, హిందూతత్వం అంశాలపై తిలక్ ప్రచురించిన రచనలు మాత్రం ఒక నూతన సంప్రదాయాన్ని, సదాచారాన్ని, భారతీయుల్లో, భారతీయ నాగరికతకు, ప్రపంచంలో గర్వించదగ్గ దేశంగా భారతీయతావిధానాలకు దోహదమయ్యాయి. వీటిమూలంగానే, గాంధీకి ఆధ్యాత్మిక, రాజకీయ గురువుగా తిలకు ను అనేకులు సమంజసంగానే భావించారు. అయితే, జాతిపిత మాత్రం, తన రాజకీయ గురువుగా, తిలక్ సమకాలీకుడైన, గోపాలకౄష్ణ గోఖలే ను, ప్రకటించారు. దీనికి విరుద్ధంగా, తిలక్ 1920 లో మరణించినప్పుడు, బోంబే లోని దహనవాటికలో, 2 లక్షలకు పైగా ప్రజాసమూహంతో నున్న గాంధి, తిలక్ కు ఘననివాళిని అర్పిస్తూ, తిలక్ ను నవభారతనిర్మాత గా గాంధి ప్రకటించడం గమనించదగ్గ విషయం. బాలగంగాధర్ తిలక్ ని మాత్రం నేటికీ నవభారత నిర్మాత గానే కాకుండా, హిందూ జాతీయతానాయకునిగా భారతావని పరిగణిస్తూనేవుంది అన్నది సత్యం. హిందూరాజకీయవాదపు అంశంగా, భారతీయ విప్లవసంస్కర్తగా వినాయక్ దామోదర్ సావార్కర్ కు ఏకైక ఆదర్శమూర్తిగా తిలక్ ని మాత్రం చెప్పుకోవాలి. తిలక్ మరపురాని సాహిత్యం బాల గంగాధరుని ప్రతిభాతిలకానికి నిదర్శనంగా, 1903 లో, 'ఆర్కిటిక్ హోం యిన్ ది వేదాశ్ అన్న ఆంగ్లభాషారచనను ఆలోచనాత్మకంగా వ్రాయడం, ఆర్కిటిక్స్ లో వేదాల్నే రచించినట్లుగాను, ఆర్యులు దక్షిణానికి తర్వాతకాలంలో తీసుకువచ్చారని ఆయన వాదంగా తిలక్ చెప్పడం కూడ జరిగింది. ప్రముఖంగా, కర్మయోగం పై విశ్లేషణగా, భగవద్గీతను గీతారహస్యం గా, వేదోపనిషత్తులసారంగా వ్రాయడం, ఆ బౄహద్గ్రంధం నేటికీ హిందువులకు నిత్యపారాయణగ్రంధంగా ఆదరణీయంగానే భావించబడుతోంది. తిలక్ యితర రచనలను చెప్పాలంటే, హిందూ జీవనం-నైతికత-మతపరంపర, వేదసంహిత-వేదాంగజ్యోతిషాలు, యం.డి.విద్వాన్స్ సంపాదకీయంలో లోకమాన్య తిలక్ లేఖలు, రవీంద్రకుమార్ సంపాదకీయంలో గంగాధరుని పత్రరచనలు, తిలక్ పై వచ్చిన ఆరోపణల సారాంశ రచనలు ప్రముఖ ప్రభావాల్ని, ఉత్తేజితకరమైన ఆలోచనావిధానాల్ని రేకెత్తించాయన్నది నిజం. లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ఆగష్టు 1, 1920 న తన అంతిమ శ్వాసను విడిచారు. బాలగంగాధరుడి పాత్ర, ప్రభావం, ప్రేరణ, భారతీయతకు పునాది, హిందూవాదానికి వేదసంహితసమానమని నిర్ద్వందంగా భావించవచ్చు అన్న భావన, సత్యం, శివం, సుందరం. పవిత్రభావనలు అన్ని దిశలనుంచి అవతరించాలన్నది తిలక్ విషయంలో ౠజువర్తనమయింది. లోకమాన్య బాలగంగాధర తిలక్ మహనీయుడి జయంతి సందర్భంగా - తెలుగురధం - సహస్ర నమోవాకాలని సమర్పిస్తోంది. కొంపెల్ల శర్మ.

చంద్రశేఖర్ ఆజాద్.

‘నీలో ఉన్నది ఉప్పునీరా? అయితే నీకోసమే బతుకు. కాదూ ఉడుకు రక్తమంటావా? అయితే దేశం కోసం మరణించు. నీ దేహం నిప్పుకణాల కొలిమి అయితే అనుక్షణం నీ ప్రాణాన్ని సంఘానికి సమర్పించు. నీ గుండెకాయ పత్తికాయ అయితే భరతమాతను మరిచిపోయి నీ సుఖమే చూసుకో’ - ఇలా రోమాలు నిక్కబొడుచుకునేలా పలికిన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. కాస్త పొట్టి. దృఢమైన శరీరం. చామనఛాయ. కుడి మోకాలి దగ్గర రివాల్వర్. ముఖమంతా మశూచి గుర్తులు. విశాలమైన నుదురు. మెలి తిరిగిన మీసం. దాన్ని మరింత మెలివేస్తూ ఎడమచేయి. ఇదీ ఆజాద్ రూపం. ‘బతికుండగా నన్ను తెల్లవాళ్లు పట్టుకోలేరు. వాళ్లకంత దమ్ము లేదు’ - ఇదే మాట పదేపదే అనేవాడు చంద్రశేఖర్. 1906 జూలై 23న మధ్యప్రదేశ్‌లోని జాబ్వా జిల్లా భావ్రా గ్రామంలో పుట్టాడు. తండ్రి పండిట్ సీతారాం తివారి. తల్లి జగరాణీదేవి. అంతగా డబ్బున్న కుటుంబం కాదు వారిది. పిల్లాణ్ని సంస్కృత పండితుణ్ని చేయాలని తల్లి అనుకునేది. కాశీలో చదివించాలని కలలు కనేది. కాని చదువంటే గిట్టేది కాదు చంద్రకి. దాంతో తల్లి కట్టడి చేసేది. అది నచ్చలేదు చంద్రకి. ఇల్లొదిలి ముంబై పారిపోయాడు 13 ఏళ్లప్పుడు. అక్కడ కూలీనాలీ చేశాడు. వేరుశనగకాయలు తిని బతికాడు. మురికివాడల్లో కార్మికుల గదుల్లో తలదాచుకున్నాడు. ఉమ్ములతో, బీడీ పొగలతో, కంపుతో వాంతులొచ్చేలా ఉండేవి ఆ గదులు. రెండేళ్లు అన్నీ భరించాడు. ఇక ముంబైలో ఉండలేకపోయాడు. అలాగని ఇంటికి వెళ్లాలనిపించలేదు. ఈ కష్టాల కన్నా సంస్కృతం చదువే మంచిదనిపించింది. 1921లో వారణాసి వెళ్లిపోయాడు. సంస్కృత పాఠశాలలో చేరాడు. సరిగ్గా అప్పుడే గాంధీజీ సహాయనిరాకరణోద్యమంతో దేశం అట్టుడికిపోతోంది. దేశం నలుమూలలా నడుస్తున్న ఆందోళనలు ఆజాద్‌ను వెర్రెక్కించాయి. స్వాతంత్య్రం కోసం ఏదో ఒకటి తానూ చేయాలనుకున్నాడు. అంతే! పాఠశాల ముందే ధర్నా చేశాడు. పోలీసులు పట్టుకెళ్లారు. మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టారు. పెళ్లికెళ్లినంత సంబరం 15 ఏళ్ల చంద్రశేఖర్‌లో! మెజిస్ట్రేట్ అడిగారు ‘‘నీ పేరేంటి?’’ అని. అసలు పేరు చెప్పలేదు. ‘‘ఆజాద్’’ అన్నాడు. స్వాతంత్య్రమే నా పేరంటూ కాలరెగరేశాడు. ‘‘నీ తండ్రి పేరు?’’ అని అడిగారో లేదో ‘‘స్వేచ్ఛ’’ అన్నాడు కన్నెగరేస్తూ. ఆవేశాన్ని అణుచుకుంటూ మెజిస్ట్రేట్ అడిగారు - ‘‘నీ ఇల్లు’’ అని. టక్కున చెప్పాడు ‘చెరసాల’ అని. ఆయనకు ఒళ్లు మండింది. 15 రోజుల జైలుశిక్ష విధించారు. చిలిపి చంద్ర ఊరుకోలేదు. ‘‘నాకు తెలుసు సర్. నన్ను మా ఇంటికే పంపుతారని’’ అన్నాడు. ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. ఖైదు రద్దుచేసి 15 కొరడా దెబ్బల్ని ఖరారు చేశారు. చర్మం చీలిపోయేలా, ఒళ్లంతా రక్తం కారేలా చితకబాదారు పోలీసులు. ఏడవలేదు ఆ కుర్రాడు. ఒంటిపై పడిన ప్రతి దెబ్బా కర్తవ్యబోధ చేసింది. ‘తాను పుట్టిందే జన్మభూమి రుణం తీర్చుకునేందుకు’ అని అనుకున్నాడు. చంద్రశేఖర్ తివారీ కాస్తా చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు. రాంప్రసాద్ బిస్మిల్ స్నేహంతో ఆజాద్‌లో విప్లవ బీజాలు బలంగా నాటుకున్నాయి. బిస్మిల్, అష్నుకుల్లా ఖాన్, రోషన్‌సింగ్‌లు రైలు దోపిడీకి పన్నిన కుట్రలో పాల్గొన్నాడు. 1924 ఆగస్టు 9న ఈ విప్లవకారులంతా కాకోరి అనే ఊరు వద్ద రైల్ ఆపి ప్రభుత్వ సొమ్ము దోచుకున్నారు. ఈ కుట్ర కేసులో ముందో వెనకో అందరూ పోలీసులకు చిక్కారు - ఒక్క ఆజాద్ తప్ప. ఆజాద్ మాత్రం రహస్య జీవితంలోకి వెళ్లిపోయాడు. అజ్ఞాతవాసంలో ఆజాద్ రహస్య కేంద్రం-ఉత్తరప్రదేశ్‌లోని ఓర్చా అరణ్యం. ఇక్కడ సతార్ నది ఒడ్డున ఆంజనేయుడి గుడి పక్క ఓ కుటీరం కట్టాడు. జన్మతః బ్రాహ్మణుడు కాబట్టి, సంస్కృతం వచ్చు కాబట్టి హరిశంకర బ్రహ్మచారి అనే సాధువుగా వేషం మార్చాడు. అన్ని కుట్రలకూ ప్రణాళిక వేసింది ఇక్కడి నుంచే. కాకోరి కేసులో ఆజాద్ కోసం పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. 1928 సెప్టెంబర్‌లో భగత్‌సింగ్, సుఖ్‌దేవ్ తదితరులతో కలిసి ‘హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్’ను స్థాపించాడు ఆజాద్. లాలా లజపతిరాయ్ మరణానికి కారణమైన స్కాట్ అనే పోలీసు అధికారిని చంపాలనుకున్నారు వీరంతా. భగత్, రాజ్‌గురు - స్కాట్‌ని తుపాకీతో కాల్చేలాగ, అందరూ పారిపోయేందుకు ఆజాద్ సహకరించేలా ప్రణాళిక వేశారు. తీరా స్కాట్ అనుకుని సాండర్స్ అనే పోలీసును కాల్చారు. వెంటనే పారిపోయారు భగత్, రాజ్‌గురు. కాని చనన్‌సింగ్ అనే పోలీసు వారిని వెంబడించాడు. ఈ హఠాత్పరిణామానికి ఒక్క క్షణం హతాశుడైపోయాడు ఆజాద్. ఒక దశలో ఆ ఇద్దరినీ పట్టేసుకోగలిగినంత దగ్గరకొచ్చేశాడు చనన్‌సింగ్. ముగ్గురూ ఒకరిని కాపాడుకుంటూ మరొకరు పరుగోపరుగు. భగత్‌ను చనన్ పట్టుకుంటే, రాజ్‌గురు చనన్‌ను లాగేశాడు. రాజ్‌గురును చనన్ పట్టుకుంటే, భగత్ లాగేశాడు. ముగ్గురూ పెనుగులాడుకున్నారు. ఇలాంటి దశలో చనన్‌ని కాల్చి చంపక తప్పలేదు ఆజాద్‌కి. వెంటనే రివాల్వర్ పేల్చాడు. చనన్ నేలకూలాడు. వాయువేగంతో సాగిపోయే వాహనంలోంచి వెంట్రుకవాసి వస్తువుని సైతం కళ్లుమూసుకుని గురి తప్పకుండా కాల్చగల పట్టు ఆజాద్‌ది. ఇంకోపక్క ఆజాద్ కోసం పోలీసుల వేట ముమ్మరమైంది. కాన్పూర్‌లో ఓసారి పోలీసుల కంటపడ్డాడు. రాత్రి 12 గంటలకు శివవర్మతో కలిసి సందులు గొందుల గుండా పరుగు. మూల్‌గంజ్ ప్రాంతంలో ఓ చిన్న గల్లీలోకి వెళ్లేసరికి, ఓ మేడపై నుంచి అందమైన పాట వినిపించింది. అంతే! ఆగిపోయాడు ఆజాద్. ఆ కోకిల స్వరాన్ని వింటూ కూచున్నాడు. ఆమె వేశ్య అని అక్కడి వాతావరణం చెబుతోంది. వెనక పోలీసులు తరుముతున్నారని తెలుసు. అయినా ఆ నిశ్శబ్ద నిశీధి వాతావరణంలో చీకటిని చీల్చుకుంటూ వెన్నెల జలపాతంలా జారుతున్న ఆమె పాటను వింటూ మంత్రముగ్ధుడైపోయి, ఉన్మత్తుడి విధాన తాదాత్మ్యంలో అలాగే ఉండిపోయాడు. పోలీసులొచ్చేస్తున్నారు మొర్రో అని శివవర్మ చెబుతున్నా వినిపించుకోలేదు. ఆజాద్‌కి సంగీతమన్నా, పాటలన్నా అంత పిచ్చి. తర్వాత నేరుగా ఝాన్సీకి పారిపోయాడు. తోటి విప్లవకారులతో ఓ ఇంటిలో దాక్కున్నాడు. పోలీసులు ఎలాగైనా ఆజాద్‌ను పట్టుకునేందుకు ఝాన్సీ నగరాన్ని జల్లెడ పట్టడం మొదలెట్టారు. తామంతా కలిసి ఆజాద్‌ను సురక్షిత ప్రాంతానికి దొంగతనంగా తీసుకెళ్లిపోతామన్నారు మిత్రులు. కాని ఆజాద్ ఒప్పుకోలేదు. నా ఒక్కడి కోసం మీరెందుకు బలవ్వాలి అన్నాడు. వారు ఎంత వద్దన్నా వినకుండా అందర్నీ పంపించేశాడు. ఆ రాత్రికి తానొక్కడే ఆ గదిలో ఉన్నాడు. ఏ క్షణాన్నయినా రక్షకభటులు రావచ్చు. ఇక దొరికిపోయినా ఆశ్చర్యం లేదు. తెల్లారబోతోంది. రాత్రంతా నగరాన్ని గాలించిన పోలీసులు చివరకు ఆజాద్ ఉన్న గదికి వచ్చారు. లోపల ఉన్నాడని వారికి నమ్మకంగా తెలుసు. అందుకే చుట్టూ పహారా కాసి, బలంగా తలుపులు బద్దలుకొట్టి మూకుమ్మడిగా లోపలకు దూసుకొచ్చారు. కాని ఆజాద్ లేడు. వెక్కిరిస్తూ కొన్ని వార్తాపత్రికలు ఉన్నాయి. దటీజ్ ఆజాద్. ఇది జరిగింది 1929 మే 2న. పార్లమెంటుపై బాంబు దాడి కేసులో భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు ఉరిశిక్ష ఖరారు చేశాయి న్యాయస్థానాలు. ఎంతగా విచలితుడయ్యాడో ఆజాద్. వారిని విడిపించేందుకు ఎంతకైనా తెగించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. 1931 ఫిబ్రవరి 27న తెల్లారగట్ల జవహర్‌లాల్ నెహ్రూని కలిశాడు ఆజాద్. విప్లవ వీరులైన భగత్‌సింగ్ తదితరుల్ని విడిపించేందుకు సహకరించమన్నాడు. నెహ్రూ అందుకు అవుననలేదు, కాదనలేదు. ఆజాద్ అక్కడి నుంచి నేరుగా అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్ పార్కుకి వెళ్లాడు. ఓ చెట్టు కింద ఇద్దరు విప్లవ మిత్రులతో కూచున్నాడు. భగత్ త్రయాన్ని ఎలాగైనా విడిపించేందుకు వారితో చర్చిస్తున్నాడు. అంతలో వారిలో ఒకరు పోలీసు ఇన్‌ఫార్మర్ అని అనుమానమేసింది. ఆజాద్ మెదడు పాదరసంలా పనిచేసింది. కుడిచేయి మోకాలి దగ్గరి రివాల్వర్ దగ్గరకు వెళ్లింది. క్షణంలో సగం వంతు కాలంలో చుట్టూ పోలీసులు. అంతకన్న వేగంగా కాల్పులు జరిపాడు ఆజాద్. ముగ్గురు పోలీసులు తూటాలకు బలైపోయారు. ఒక్క పోలీసు కూడా తనను ముట్టుకోకుండా తుపాకీని కాలుస్తూనే ఉన్నాడు ఆజాద్. ఒక్క బుల్లెట్ మాత్రమే మిగిలింది. అది కూడా అయిపోతే, పోలీసులకు తాను పట్టుబడటం ఖాయం. ఛీ! బతికుండగా బ్రిటిష్ వారికి చిక్కడమా? నెవ్వర్! అంతే! ఆ ఒక్క తూటాతో తననే కాల్చుకున్నాడు ఆజాద్. నేలకూలాడు.అదీ మహాప్రసాదమే అనుకున్నారు పోలీసులు. భగత్‌సింగ్‌ను ఉరితీయడానికి సరిగ్గా 25 రోజుల ముందే ఆత్మత్యాగం చేశాడు పాతికేళ్ల ఆజాద్. స్వాతంత్య్రం అంటే ఆత్మగౌరవమని నిరూపించాడు. - ఆకెళ్ల రాఘవేంద్ర

Sunday, July 21, 2013

Prakasam Barrage . (ప్రకాశం బ్యారేజి)



Prakasam Barrage The structure of the Prakasam Barrage stretches 1223.5 m across the Krishna River connecting Krishna and Guntur districts. The barrage serves also as a road bridge and spans over a lake. The three canals associated with the barrage run through the city of Vijayawada crossing it and giving it a Venetian appearance. The idea of constructing a dam across the river Krishna dates back to 1798. It began in the hands of captain Buckle and was revised in 1839 and 1841 by captain Best and captain Lake. After the endorsement of Major Cotton, the board of Directors of East India Company approved it on 5 January 1850. The dam was started in 1852 and completed in 1855. Later, the State Government constructed a bridge that was named after Sri Tanguturi Prakasam, the first Chief Minister of Andhra (A State formed in 1953, which later became Andhra Pradesh in 1956 after the merger of Telugu speaking districts of former Hyderabad State). Completed in 1957 it helps irrigating over 12 lakh (1.2 Million) acres of land. This barrage also supplies water to Buckingham canal which was constructed as inland navigation canal initially but later used as irrigation water supply canal. One of the first major irrigation projects of South India, the Prakasam Barrage in Vijayawada was completely successful in its mission. Andhra Pradesh largely owes its rich agriculture to the Prakasam dam as the project facilitated the irrigation of large tracts of farmland. The dam provides views of the lake. It has become a tourist attraction of Vijayawada. (From Wikipedia, the free encyclopedia) ప్రకాశం బ్యారేజి : విజయవాడ వద్ద, కృష్ణా నది పై నిర్మించిన బ్యారేజి. దీని పొడవు 1,223.5 మీటర్లు (4,014 అడుగులు)దీని నిర్మాణ బాధ్యతలు ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో సర్ ఆర్థన్ కాటన్ చేపట్టాడు. దీని నిర్మాణ 1852 లో ప్రారంభమై 1855 లో పూర్తయింది. కృష్ణా, గుంటూరు జిల్లాలలోని కృష్ణా డెల్టా ప్రాంతానికి సాగునీటిని అందించే నీటిపారుదల ప్రాజెక్టు ఈ ప్రకాశం బారేజి. ఇప్పటి బారేజి 1952లో నిర్మించబడినా, అంతకు 100 సంవత్సరాల కిందటే -1853లో - కృష్ణా నది జలాలను వినియోగించుకోవడాన్ని ఉద్దేశించిన మొట్టమొదటి నిర్మాణం జరిగింది. అదే కాటన్ ఆనకట్ట. తెలుగుదేశంలో సర్ ఆర్థన్ కాటన్ నిర్మించిన రెండు ప్రముఖ ఆనకట్టలలో ఇది రెండోది. మొదటిది, గోదావరి నదిపై గల కాటన్ బారేజి. 1832, 1833 లలో ఈ ప్రాంతంలో భయంకరమైన కరువు ఏర్పడింది. డొక్కల కరువు, నందన కరువు, గుంటూరు కరువు, పెద్ద కరువు గా పేరుపొందిన ఈ కరువు వేలాది మందిని పొట్టన పెట్టుకుంది. ఎక్కడ చూసినా శవాలగుట్టలే కనిపించేవి. దాదాపు 40% ప్రజలు ఈ కరువుకు బలయ్యారు. బ్రిటిషు ప్రభుత్వం పన్నుల రూపేణా రూ.2.27 కోట్లు నష్టపోయింది. ఇంత తీవ్ర కరువులోనూ కృష్ణానది ఎండిపోలేదు. అయినా ఆ నీటిని వాడుకునే మార్గం లేకపోయింది. ఈ పరిస్థితుల్లో కృష్ణ నీటిని సాగుకు వాడుకునే ఉద్దేశంతో నదిపై బెజవాడ (విజయవాడ) వద్ద ఆనకట్టను ప్రతిపాదించారు. ఆనకట్ట నిర్మాణం రతిపాదన కార్యరూపానికి రావడానికి మరో ఇరవై ఏళ్ళు పట్టింది. బెజవాడ వద్ద ఎడమ గట్టునగల ఇంద్రకీలాద్రి, కుడి గట్టున ఉన్న సీతానగరం మధ్య ఈ ఆనకట్ట నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఆనకట్ట నిర్మాణం 1853లో మొదలై, 1854లో పూర్తయింది. 1132 మీ. పొడవు, 4 మీటర్ల ఎత్తుతో అనకట్ట పైగుండా వరదనీరు ప్రవహించేలా నిర్మించబడింది. రూ.1.49 కోట్లు ఖర్చయింది. 10 ప్రధాన కాలువల ద్వారా సాగునీటి సరఫరా చేయడం మొదలుపెట్టారు. కాలువల నిర్మాణాన్ని కాటన్ శిష్యుడైన మేజర్ ఓర్ పర్యవేక్షించాడు. వంద సంవత్సరాలపాటు ఆనకట్ట ప్రజలకు వరప్రసాదమైంది. 1952లో వచ్చిన వరదలకు అది కొట్టుకొని పోవడంతో మరో ఆనకట్ట ఆవశ్యకత ఏర్పడింది. బారేజి నిర్మాణం పాత ఆనకట్ట కొట్టుకొని పోయిన వెంటనే కొత్త బారేజి నిర్మాణం మొదలయింది. పాత ఆనకట్టకు కొద్ది మీటర్ల ఎగువన బారేజిని నిర్మించారు. ఇసుక పునాదులపై నిర్మించిన ఈ బారేజి నీటి నియంత్రణకే కాక, 24 అడుగుల వెడల్పుతో రోడ్డు, రోడ్డుకు రెండు వైపులా 5 అడుగుల వెడల్పుతో నడకదారి కలిగిఉంది. ఈ రోడ్డు చెన్నై, కోల్‌కతా జాతీయ రహదారిలో ఉంది. బారేజీకి తూర్పు, పడమరల్లోని కృష్ణా డెల్టా ప్రాంతంలోని 13.08 లక్షల ఎకరాలకు ఈ బారేజి నుండి సాగునీరు లభిస్తుంది. మహబూబ్‌నగర్ జిల్లా జూరాల వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించి కృష్ణా జిల్లా నాగాయలంక, కోడూరు వద్ద రెండు పాయలుగా బంగాళాఖాతంలో కలిసే కృష్ణానదిపై చిట్టచివరి ఆనకట్ట ప్రకాశం బ్యారేజ్. విజయవాడకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన ఈ ఆనకట్ట తన 154 ఏళ్ల చరిత్రలో ఎన్నో సవాళ్లను అధిగమించింది. 1832లో కృష్ణా తీరంలో కరవు వచ్చినప్పుడు నదిపై ఆనకట్ట కట్టాలనే ఆలోచన నాటి బ్రిటీష్ పాలకులకు వచ్చింది. సర్ ఆర్థర్ కాటన్ సారథ్యంలో, ఛార్లెస్ అలెగ్జాండర్ పర్యవేక్షణలో ఆనకట్ట నిర్మాణం 1852లో ప్రారంభమై 1855 మే 9న పూర్త్తెంది. 4014 అడుగుల పొడవుతో నిర్మించారు. దీనికి అయిన ఖర్చు రూ.1.4 కోట్లు. ఆయకట్టు 4.7 లక్షల ఎకరాలు. నీటి అవసరం పెరగడంతో 1893లో ఎత్తు మూడు అడుగులు పెంచారు. ఈ ఆనకట్ట వంద ఏళ్ల పాటు కచ్చితంగా సేవలందిస్తుందని కాటన్ అప్పట్లోనే ప్రకటించారని చెబుతుంటారు.1954 ఫిబ్రవరి 13 న మొదలైన బారేజి నిర్మాణం దాదాపు నాలుగేళ్ళలో పూర్తయింది. 1957 డిసెంబర్ 24 న బారేజిపై రాకపోకలు మొదలయ్యాయి. బారేజి నిర్మాణానికి రూ. 2.78 కోట్లు ఖర్చయింది. బచావత్ ట్రిబ్యునల్, కృష్ణా డెల్టా కు 181.2 టి.ఎం.సి.ల నీటిని కేటాయించింది. బారేజి కింద సాగునీరు లభించే ఆయకట్టు వివరాలు ఎడమ గట్టు - (కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలు) సంఖ్య కాలువ పేరు ఆయకట్టు, ఎకరాలలో 1. ఏలూరు కాలువ 1,15,000 (55,000 పశ్చిమ గోదావరి) 2 రైవస్ & దిగువ పుల్లేరు కాలువ 1,75,000 3 పోలరాజు కాలువ 44,400 4 బంటుమిల్లి కాలువ 64,600 5 కాంప్‌బెల్ కాలువ 49,000 6 బందరు కాలువ 1,07,837 7 ఆర్.ఆర్.పాలెం 32,389 8 ఎగువ పుల్లేరు కాలువ 10,992 9 కృష్ణా ఎడమగట్టు కాలువ 1,36,280 మొత్తం 7,35,498 కుడిగట్టు (గుంటూరు, ప్రకాశం జిల్లాలు) సంఖ్య కాలువ పేరు ఆయకట్టు, ఎకరాలలో 1 కె.డబ్ల్యు.ప్రధాన కాలువ 22,172 2 కుడిగట్టు కాలువ 1,55,344 3 తూర్పు కాలువ 53,992 4 పశ్చిమ కాలువ 27,588 5 నిజాంపట్నం కాలువ 22,124 6 హైలెవెల్ కాలువ 26,414 7 కొమ్మమూరు కాలువ (బకింగ్‌హాం కాలువ) 2,63,717 (75,500 ప్రకాశం) మొత్తం 5,71,351 ఎత్తిపోతలు సంఖ్య కాలువ పేరు ఆయకట్టు, ఎకరాలలో 1 కృష్ణా జిల్లా వైపు 11,500 2 గుంటూరు వైపు 4,500 మొత్తం 16,000